Thursday 21 July 2011

Telangana Today rastarokolu

నేడు తెలంగాణలో రాస్తారోకోలు





రామచంద్రాపురం (మెదక్), న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట ప్రాణత్యాగం చేసిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉద్యమకారుడు యాదిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం తెలంగాణ జిల్లాల్లో రాస్తారోకోలు చేయాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం భెల్ అధికార కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) కార్యాలయంలో జరిగిన కార్మికుల జేఏసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అనేక మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం కళ్లు తెరవకపోవడం బాధాకరమన్నారు. సీమాంధ్ర నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమ్ముడు పోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కేంద్రం వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యపోరాటం అవససరమని చెప్పారు. రాష్ట్రం సాధించే వరకు రాజీలేని పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment