Tuesday 19 July 2011

bjp jai andhra

‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు
- అదే విషయాన్ని సీమాంధ్రలో వివరించేందుకు సిద్ధం
- రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ‘జై ఆంధ్ర’ కోసం తీర్మానం
- ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర స్థాయిలో మద్దతు ఇస్తున్న బీజేపీ... అదే స్థాయిలో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రం రెండుగా విడిపోతే కలిగే ప్రయోజనాలను సీమాంధ్ర ప్రజలకు వివరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరనుంది. ఇటీవల రెండురోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత బీజేపీలోని తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీన్ని సీమాంధ్ర ప్రాంత ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ నాయకత్వం అప్పటినుంచి ఇరువూపాంతాల నాయకులతో సంప్రదింపులు జరుపుతూనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇరు ప్రాంతాల నుంచి పాల్గొన్న నాయకుల అభివూపాయాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీమాం్ర ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించకపోయినా హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంవూధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికోసం బీజేపీ ప్రత్యేక కార్యక్షికమాన్ని రూపొందించి హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజల భద్రతకు పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించింది.

సీమాంధ్రలో పట్టుకోసం...
సీమాంవూధలో పార్టీ బలోపేతం జరిగే విధంగా కార్యాచరణను రూపొందించే పనిలో బీజేపీ సమాయత్తం అవుతున్నది. అందుకోసం ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సీమాంధ్ర నేతలు సీమాంధ్ర ప్రాంతానికి ఏవిధంగా అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా రాష్ట్ర విభజనకు మార్గం వేయాలని బీజేపీ నాయకత్వం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించింది. విడిపోతే ఏర్పడే ప్రయోజనాలపై సమావేశంలో పార్టీ నేతలు చర్చించారు. అందుకోసం సీమాంవూధలో ఉన్న సహజవనరులు, వాటిని ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించింది. దీని ద్వారా సీమాంధ్ర ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడమే కాక ‘జైఆంధ్ర’ ఉద్యమాన్ని చేపట్టాలని బీజేపీ కార్యవర్గం తీర్మానించింది.

No comments:

Post a Comment