Saturday 23 July 2011

Khammam lo telangana bandh prashantham

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించటాన్ని నిరసిస్తూ తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్ పిలుపు శుక్రవారం ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలతోపాటు ఉద్యోగుల జెఏసి కూడా బంద్‌లో పాల్గొంది. జెఏసితో కలిసి న్యూడెమోక్రసీ, బిజెపి బంద్‌లో పాల్గొనగా టిఆర్‌ఎస్, సిపిఐలు విడివిడిగా పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ఎటువంటి వాహానాలు రానివ్వకుండా మధిర మండలంలో రోడ్లపై కంప వేశారు. ఖమ్మంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఫ్లెక్సీని సిపిఐ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

No comments:

Post a Comment