Tuesday 19 July 2011

telangana kosam maro balithanam

సీమాంధ్ర నాయకులు సోమవారం ఢిల్లీ వెళ్లడంతో తెలంగాణను అడ్డుకుంటారనే బెంగతో టీఆర్‌ఎస్ కండువాతోనే సొంత చేనులో ఆ పార్టీ కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లాలోని కామాడ్డి మండలం గర్గుల్ గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వడ్ల నాగభూషణం(50) ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. సోమవారం సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని టీవీలో ఉదయం నుంచి చూశాడు. గ్రామ కూడలిలోని హోటళ్లో సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటున్నారని స్థానికులతో చర్చించాడు.

ఆవేదనతో కలత చెంది సాయంత్రం పొలానికి వెళ్లి టీఆర్‌ఎస్ కండువాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. ‘తెలంగాణ కోసం చనిపోతున్నా, తెలంగాణ వస్తదని అందరికి చెప్పే వాడిని, రాష్ట్రం ప్రకటించకుండా కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా చనిపోతున్నా, నా చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే తెలంగాణను ప్రకటించాలి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

No comments:

Post a Comment