Monday 25 July 2011

prarambamina lalu tharvaja bonalu

పాతబస్తీలోని లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామునుంచే భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. మూసీ వరదల సమయంలో నిజాం నవాబు సైతం ఈ ఆలయానికి బోనాలు సమర్పించారని చరిత్ర చెబుతోంది. ఈరోజు నగరంలో దాదాపు 500 ఆలయాల్లో బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీ 25 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. లాల్‌దర్వాజ అమ్మవారిని ఈరోజు ఉదయమే టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ దర్శనం చేసుకున్నారు. అమ్మవారి బోనాలతో హైదరాబాద్‌ సందడిగా మారింది. ఆయా ఆలయాల వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పాటలతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

No comments:

Post a Comment