Monday 25 July 2011

e sari andharu raginama cheyali:ktr

తెలంగాణ కోసం గతంలో రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో పాటు రాజీనామా చేయని వారు కూడా ఈసారి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదనే కుంటిసాకుతో వెనక్కి తగ్గితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జైపాల్‌రెడ్డి తన నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని అమరవీరుడు యాదిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ చైసైనా జైపాల్‌రెడ్డి లాంటి వాల్లు కళ్లు తెరవాలని తెలిపారు. జైపాల్‌రెడ్డి ఇప్పటికే చాలా కాలం పదవిని పట్టుకుని వేలాడాడన్నారు. వెయ్యేళ్లు ఎవరూ జీవించరని, ఇప్పటికైనా, ఈ ముసలితనంలో తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసి తెలంగాణ ద్రోహిగా ముద్రపడకుండా జైపాల్‌రెడ్డి నడుచుకోవాలని కోరారు.

No comments:

Post a Comment