Saturday 23 July 2011

telangana pi cheppalisindi cheppam:chandrababu

తెలంగాణ అంశంపై తెలు గుదేశం పార్టీ 2009 డిసెంబర్‌ 9కి ముందే చెప్పాల్సింది ఎప్పుడో చెప్పిందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అధి కారంలో ఉన్న కేంద్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ర్టంలో అనిశ్చితి తొలగించి నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షుల మూడో బృందం వర్స్‌షాప్‌లో చంద్రబాబు ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో ఢిల్లీలో ఆత్మ హత్య చేసుకున్న యాదిరెడ్డికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసం గింస్తూ యాదిరెడ్డి మృతి బాధాకరమని పేర్కొన్నారు.

యువకులు సమస్య పరిష్కారం చేయని ప్రభుత్వంపై పోరాడాలే తప్ప బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు విధులు నిర్వహి స్తారంటూ ఏపీ భవన్‌లో టిఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు ఓఎస్‌ డిపై దాడి చేయడాన్ని ఖండించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఆలస్యం చేయ కుండా తెలంగాణ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని డి మాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని అవినీతిలో ముంచి, అభివృద్ధిని దెబ్బతీసి అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శించారు. టిడిపి కాపాడిన భూములను సెజ్‌ల పేరుతో ధారాదత్తం చేసి సొంత కంపెనీ లలో పెట్టుబడులు పెట్టించుకున్నారని విమర్శించారు.

ప్రాజెక్టులపై రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టినా 6 వేల ఎక రాలకు సాగునీరు అందించలేక పోయారని ధ్వజమెత్తారు. 18 నెలల్లో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. గోదావరిపై బాబ్లీ సహా 13 ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారని, కృష్ణా, వంశధార వివాదాలను పరిష్కరించలేక పోయారని మండి పడ్డారు. ఉత్తర తెలంగాణ ఏడారిగా మారకూడదనే ఉద్దే శంతో మహారాష్టక్రు వ్యతిరేకంగా బాబ్లీపై పోరాడి జైలుకెళ్తే దానిని కూడా రాజకీయం చేశారనిఆవేదన వ్యక్తం చేశారు.

ఖనిజ సంపద దోచేశారు
ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోని ఇనుప ఖనిజం మొత్తం గాలి జనార్ధనరెడ్డి, వైఎస్‌ జగన్‌లు లూటీ చేశారని చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. 14 నెలల్లో రూ. 1800 కోట్లు దోపిడీ చేశారని ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రుల ప్రమేయంతోనే ఇది జరిగిం దన్నారు.

కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది...
నక్సలైట్ల చేతిలో మరణించినా, భూములు-ఆస్తులు కోల్పోయినా, అక్రమ కేసులలో చిక్కుకున్నా అధైర్యపడ కుండా టిడిపి జెండా మోస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. తనకు వచ్చిన పేరు ప్రతిష్ట అంతా కార్యకర్తల వల్లేనని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఎన్టీఆర్‌ మొమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య, వైద్యం, తాగు నీటి వసతి, ఉపాధి అవకాశాల కల్పన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
చివరి రక్తపు బొట్టు వరకు కార్యకర్తల కోసం, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ఈ సదస్సుకు నామా నాగేశ్వరరావు, దాడి వీరభద్రరావు, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖరరెడ్డి, అర వింద్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరై ప్రసంగించారు. పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment