Saturday 6 August 2011

telangana esthamani appu cheppaledu(తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు):kavuri

తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు ప్రసంగం ఆయన మాటల్లో..
రాష్ర్టంలోని వాస్తవాలను సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొస్తున్నా. 2004 ఎన్నికల ప్రణాళికలోగానీ, సీఎంపీలోగానీ, రాష్ర్టపతి ప్రసంగంలోగానీ ఎక్కడా తెలంగాణను ఏర్పరుస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. (ఈ చర్చలో కావూరికి ఎలా అవకాశం ఇచ్చారని బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, చర్చలో పాల్గొనాల్సి ఉన్న మరో ఇద్దరు సభ్యులు విరమించుకోవటంతో తన విశేషాధికారం ఉపయోగించి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు స్పీకర్ పేర్కొన్నారు.)

కాకినాడలో బీజేపీ తీసుకున్న ఒక ఓటు - రెండు రాష్ట్రాల హామీ నుంచి వెనక్కు తగ్గటానికి బాధ్యుపూవరు? రాష్ర్టం నుంచి ఒక్క ఎంపీ లేని బీజేపీ మాట్లాడటం కడు దయనీయం. రాష్ర్టంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ర్టంలోని అన్ని పార్టీల ఆమోదంతోనే శ్రీ కృష్ణ కమిటీ ఏర్పడింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు కోరిక మేరకే విశాలాంధ్ర ఏర్పడింది. పసంగం ముగించాల్సిందిగా స్పీకర్, చిదంబరం, ఆజాద్ పదే పదే కోరినా కావూరి ఆగలేదు. మైక్ కట్ చేసిన అనంతరం కూడా నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆయనపై చిదంబరం అసంతృప్తిని వ్యక్త పరిచారు.)

No comments:

Post a Comment